ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / మెడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని బాసరగడి గ్రామంలో గోనె సంచిలో బాలిక మృతదేహం లభించింది. స్థానికుల వివరాల ప్రకారం.. అదిలాబాద్ జిల్లా చెందిన ప్రభాకర్ కుటుంబంతో కలిసి సూరారంలో నివాసం ఉంటున్నాడు. ఈ నెల 12న కుమార్తె ఏం జోష్న(7) కనిపించడం లేదని సూరారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, బాలిక మంగళవారం శవమై కనిపించింది. దీంతో చిన్నారి కుటుంబంలో విషాదం నెలకొంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Admin
Aakanksha News