Tuesday, 28 July 2026 12:29:28 PM

కార్గో బస్సు డీ కొని ఇద్దరికీ గాయాలు...

Date : 23 October 2024 12:08 PM Views : 455

ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / కరీంనగర్ జిల్లా : కార్గో బస్సు ద్విచక్ర వాహనంకు ఢీ కొనడంతో ఇద్దరికి గాయాలైన సంఘటన హుజరాబాద్ లో చోటు చేసుకుంది. వివరాల్లో కెళ్తే హెచ్ డి ఎఫ్ సీ బ్యాంకులో విధులు నిర్వహించేందుకు రోజులాగే హన్మకొండ నుంచి హుజురాబాద్ కు తమ ద్విచక్ర వాహనంపై వెళ్తున్న క్రమంలో ప్రశాంత్, నాగరాజు అనే ఇద్దరు ఉద్యోగులు హుజురాబాద్ బస్ డిపో మూల మలుపు సమీపంలో వెనుక నుంచి వచ్చిన ఆర్టీసీ కార్గో బస్సు ఢీకొనడంతో ద్విచక్ర వాహనం పైనుంచి ఇద్దరు యువకులు కింద పడడంతో వారికి గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు 108 కు సమాచారం అందించడంతో చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :