ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / : కామారెడ్డి జిల్లా పిట్లం మండల పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న బుచ్చయ్య తన విధులు ముగించుకుని బాన్సువాడకు తన బైక్ పై వెళ్తుండగా పిట్లం మండలంలోని సిద్దాపూర్ గ్రామ శివారులోని చెరువు కట్ట వద్ద రోడ్డు పక్కన గల ఈత చెట్టుకు ఢీకొని చాతికి, తలకు బలమైన గాయాలు తగిలి అక్కడికక్కడే మృతి చెందారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రాజు తెలిపారు. బుచ్చయ్య మృతితో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.
Admin
Aakanksha News