ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / జయశంకర్ భూపాలపల్లి జిల్లా : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. అందరూ చూస్తుండగానే నడి రోడ్డుపై వృద్ధురాలిని గొడ్డలితో కిరాతకంగా నరికి చంపిన ఘటన సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళ్తే...దేవరంపల్లి గ్రామానికి చెందిన లక్ష్మీ అనే వృద్ధురాలిపై వరుసకు కొడుకు అయ్యే మారుపాక అంజి అనే వ్యక్తి గొడ్డలితో దాడి చేసాడు.గతంలో భూ తగాదా నేపథ్యంలో తండ్రి మారుపాక సారయ్యను చంపారనే కోపంతో ఒక్కసారిగా మృతుడి కుమారుడు అంజి పోలీస్ స్టేషన్ సమీపంలో లక్ష్మీ పై గొడ్డలితో దాడి చేసాడు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..
Admin
Aakanksha News