ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : గంజాయి తరలిస్తున్నాడనే పక్క సమాచారం అందుకున్న పోలీసులు ఓ దిచక్ర వాహనాన్ని ఆపడానికి ప్రయత్నం చేయగా నిందితుడు పోలీసులని బైక్ తో డీ కొట్టి వెళ్లిపోయిన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... దిచక్ర వాహనంలో గంజాయి తరలిస్తున్నారని పక్క సమాచారం పోలీసులకు రావడంతో జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ బ్రిడ్జి సెంటర్ చెక్ పోస్టు వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసారు. ఈ క్రమంలోనే పోలీసులను చుసిన నిందితుడు అతివేగంగా అడ్డుగా ఉన్న పోలీసులను ఢీ కొట్టి పరారయ్యారు.ఈ ఘటనలో పోలీసుకు స్వల్ప గాయాలయ్యాయి.
Admin
Aakanksha News