Sunday, 26 April 2026 05:47:23 PM

హత్య కేసులో నిందితుల అరెస్టు....

Date : 20 September 2023 05:18 PM Views : 701

ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / గోదావరిఖని : పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ ఖాజీపల్లి గ్రామానికి చెందిన మేకల లింగయ్య హత్య కేసులో నలుగురి నిందితులను అరెస్టు చేసినట్లు రామగుండం సీపీ రేమా రాజేశ్వరి తెలిపారు. ఈ సందర్భంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టి హత్యకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఖాజీపల్లి గ్రామానికి చెందిన మేకల కుమారస్వామి, అతని అనుచరులు మాతంగి కాలనీకి చెందిన ధర్మారపు అనిల్, కమాన్ పూర్ కు చెందిన కట్ల శంకర్,కరీంనగర్ కు చెందిన విద్యాసాగర్ లతో కలసి పథకం ప్రకారం హత్య చేశారని పేర్కొన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో తనకు అడ్డు వస్తున్నాడని తను ఎదగకుండా ఒక్కడే ఎదుగుతున్నాడని ద్వేషం పెంచుకున్న కుమారస్వామి ఎలాగైనా మృతుడు లింగయ్యను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకొని నిందితులు లింగయ్య కదలికలను తెలుసుకున్నారని హత్యకు పథకం వేశారని అన్నారు.ఈ క్రమంలోనే 18వ తేదీన రాత్రి 8 నుండి 9 గంటల ప్రాంతంలో తన ఇంటి దగ్గర కాళీ స్థలంలో చీకట్లో మృతుడు లింగయ్య వాకింగ్ చేస్తున్న సమయంలో రెండు దిచక్ర వాహనాలపై వచ్చి ఒక్కసారిగా కత్తులతో దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందాడని. అనంతరం అదే దిచక్ర వాహనాలపై ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్ కు చేరుకొని నిందితులు పరారైయ్యారన్నారు. దీంతో సమాచారం అందుకున్న ఎన్టీపీసీ ఎస్.ఐ జీవన్ సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం ఏసీపీ తులా శ్రీనివాస్ రావుకు వివరాలను తెలపడంతో డాగ్ స్క్వాడ్ తో సంఘటన స్థలాన్నీ పరిశీలించారు. అనంతరం కుటుంబ సభ్యుల పిర్యాదు మేరకు సాంకేతిక పరిజ్ఞానంతో హత్య జరిగిన 24 గంటల్లోనే నిందితులను పట్టుకున్నట్లు సీపీ రేమా రాజేశ్వరి తెలిపారు. ఈ సమావేశంలో పెద్దపల్లి డిసిపి వైభవ్ గైక్వాడ్ గోదావరిఖని తుల శ్రీనివాస్ రామగుండం సీఐ చంద్రశేఖర్ గౌడ్ ఎన్టీపీసీ ఎస్ ఐ జీవన్, అంతర్గాం ఎస్ఐ సంతోష్ కుమార్ పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :