Wednesday, 29 July 2026 09:19:47 AM

భద్రతా దళాల ముందు లొంగిపోయిన 33 మంది నక్సల్స్....

Date : 18 April 2025 07:09 PM Views : 646

ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / : ఛత్తీస్‌గఢ్‌లో 33 మంది మావోయిస్టులు లొంగిపోయారు. శుక్రవారం సుక్మా జిల్లాలో భద్రతా దళాల ముందు 33 మంది నక్సల్స్ లొంగిపోయారని పోలీసులు తెలిపారు. వారిలో తొమ్మిది మంది మహిళలు సహా 22 మంది మావోయిస్టులు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్సెస్ (CRPF) సీనియర్ అధికారుల ముందు లొంగిపోయారు. తరువాత ఇద్దరు మహిళలు సహా 11 మంది నక్సల్స్ పోలీసు అధికారుల ముందు లొంగిపోయారు. వీరిలో 17 మంది నక్సల్స్ కు రూ. 49 లక్షల బహుమతిని అధికారులు అందించారు. ఈ సందర్భంగా సుక్మా పోలీసు సూపరింటెండెంట్ (SP) కిరణ్ చవాన్ మాట్లాడుతూ.. అమానవీయ మావోయిస్టు భావజాలం, స్థానిక గిరిజనులపై దౌర్జన్యాలతో నిరాశకు గురైన వీరంతా.. మావోయిస్టు క్యాడర్ ను బయటకు వచ్చారని సుక్మా తెలిపారు. మారుమూల గ్రామాలలో అభివృద్ధి పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘నియాద్ నెల్లనార్’ (మీ మంచి గ్రామం) పథకం, లొంగిపోయిన నక్సల్స్ కు పునరావాస విధానం వారిని ఆకట్టుకున్నాయని అధికారి తెలిపారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :