ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / రంగారెడ్డి జిల్లా : రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరదిలో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళ కానిస్టేబుల్ ను అతి దారుణంగా కత్తితో మెడపై నరికి గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. వివరాల్లోకి వెళ్తే...హయత్ నగర్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న నాగమణి అనే కానిస్టేబుల్ హత్యకు గురైంది.. అయితే మహిళా కానిస్టేబుల్ ఇటీవలే కులాంతర వివాహం చేసుకున్నట్లు తెలుస్తుంది. ఉదయం విధులకు వెళ్తున్న సమయంలో దారుణ హత్యకు కానిస్టేబుల్ గురయ్యారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు విచారణ చేపడుతున్నారు.
Admin
Aakanksha News