Tuesday, 28 July 2026 04:13:31 AM

బ్యాంకులో తాకట్టు పెట్టిన బంగారం మాయం...

160 ఖాతాదారుల బంగారం మాయం చేసిన ఉద్యోగి

Date : 16 February 2025 05:04 PM Views : 623

ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / కాకినాడ జిల్లా : బ్యాంకులో తాకట్టు పెట్టిన బంగారం మాయమైంది. అది ఒక్కరి ఇద్దరిది కాదు... ఏకంగా 160 మంది ఖాతాదారులు తాకట్టు పెట్టిన బంగారం మాయం అయింది. ఇంత జరిగిన బ్యాంకుకు ఖాతాదారులు వచ్చి అడిగే వరకు కూడా అధికారులు గుర్తించక పోవడం ఆశ్చర్యానికి దారి తీస్తుంది. వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లా తుని మండలం తేటగుంట కెనరా బ్యాంక్ లో బ్యాంకులో పనిచేస్తున్న అప్రైజర్ 160 మంది ఖాతాదారుల బంగారు నగలను మాయం చేసినట్లు గుర్తించారు. అధికారులు. తమ బంగారం మాయం కావడంతో బ్యాంకు వద్దకు వచ్చి ఆందోళన చేశారు ఖాతాదారులు. ఉన్నత అధికారులతో మాట్లాడి సెటిల్మెంట్ చేస్తామని కస్టమర్లకు సర్దిచెప్పారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :