ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / జగిత్యాల జిల్లా : జగిత్యాల జిల్లా ధర్మపురి గోదావరి నదిలో ప్రమాదవశాత్తు కాలు జారి నీటిలో మునిగి చెన్నూరి కార్తిక్ (13) అనే బాలుడు మృతి చెందాడు. మృతుడు బోధన్ మండలం అందాపూర్ కు చెందిన బాలుడిగా గుర్తించారు. వివరాల్లోకి వెళ్తే..బంధువులతో కలిసి గోదావరిలో స్నానం చేయడానికి వెళ్లిన 7వ తరగతి చదువుతున్న బాలుడు తిరిగి వెళ్లే క్రమంలో కాలు జారి లోతైన నీటిలో పడి మృతి చెందాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని గోదావరి నది నుండి బయటకు తీసారు.
Admin
Aakanksha News