Sunday, 26 April 2026 06:06:52 PM

ఊర్లో ఉన్న విలువైన స్థలాలపైనే వీరి కన్ను....

కూల్చివేయడానికి దిటి బాలరాజు,మోహిద్ సన్నీలు ఎవరు...⁉️ వేముల అశోక్

Date : 26 December 2024 05:26 PM Views : 1787

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / గోదావరిఖని : ఊరిలో ఉన్న విలువైన స్థలాలపైన వీరి కన్ను పడిందని ఓల్డ్ అశోక బాధితుడు వేలు అశోక్ ప్రశ్నించారు. ఈ సందర్బంగా పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని ఓల్డ్ అశోక టాకీస్ కూల్చివేతలను తెలుగు షార్ట్ ఫిలిం ఆర్టిస్ట్ అసోసియేషన్ వారు సందర్శించి వేముల అశోక్ కు మద్దతు తెలిపారు. కూల్చివేసిన విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం బాధితుడు వేముల అశోక్ మాట్లాడుతూ... గౌరవ తెలంగాణ హైకోర్టు న్యాయస్థానం నాకు నా యొక్క స్థల విస్తీర్ణం 150×250 ఓల్డ్ అశోక టాకీస్ పై స్టేటస్కో ఆడరు ఇచ్చిన కూడా పట్టించుకోకుండా ఆ స్థలంలోకి ఈ నేల 24.25 వ తేదీలలో అక్రమార్కులు దిటి బాలరాజు, మోహిద్ సన్నీలు అక్రమంగా చొరబడి అందులో ఉన్న వృక్షాలను తెగ్గొట్టి ఆ స్థలాన్ని జెసిబి బ్లేడ్ ట్రాక్టర్ తో చదును చేపించడం జరిగిందన్నారు. ఇదేమిటి అటు సింగరేణి,రెవెన్యూ, మున్సిపాలిటీ వాళ్లు కాకుండా మధ్యలో వీరి పెత్తనం ఏమిటని అయన ప్రశ్నించారు. ఊర్లో విలువైన స్థలాలపై కన్ను వేసి ఆ స్థలాలను ఏ విధంగానైనా అస్తగతం చేసుకోవాలని కుట్రలో భాగంగానే వీరి ఆగడాలు కొనసాగుతున్నాయని ఇలాంటి వ్యక్తుల అరాచకాలను ప్రజలందరూ ఖండించాలని కోరారు.

కబ్జా చేయాలనే దూరాలోచనతో థియేటర్ ను కూల్చివేశారు. తెలుగు షార్ట్ ఫిలిం ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు

కబ్జా చేయాలనే దూరాలోచనతో థియేటర్ ను కూల్చివేశారని తెలుగు షార్ట్ ఫిలిం ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులు ఆరోపించారు. ఓల్డ్ అశోక వేల్చివేతలపై తెలుగు షార్ట్ ఫిలిం ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులు సందర్శించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. వేముల అశోక్ మల్టీప్లెక్స్ కట్టడానికి ముందుకు వస్తే సహకరించకుండా తన కూలర్ షాపును కూడా కావాలనే కూల్చివేసినట్లుగా అర్థమవుతుందని విమర్శించారు. ఎవరైనా ప్రజలకి ఉన్న ఇబ్బందుల నుంచి బయట పడవేయాలి కానీ ఇబ్బందులని ఆసరా చేసుకొని దాంట్లో లబ్ధి పొందాలని చూడటం మూర్ఖత్వం అని ఆరోపించారు. ఏ రాజకీయ పార్టీ అయినా ఏ నాయకుడైన వారి గూర్చి వారి ప్రభుత్వం గురించి వారి పథకాల గురించి గొప్పతనం గురించి ప్రజలకు చేరవేసేది కళాకారుడేనని అలాంటి కళాకారులకి నష్టానికి పూనుకోవడం చాలా అన్యాయమని ఇలాంటి అన్యాయాలు అక్రమాలు ఎవరు చేసినా మా కళాకారులంతా ఖండించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఎవరైనా చట్టాలను పాటించాలని చట్టాలకు విరుద్ధంగా ఇలా విధ్వంసాన్ని సృష్టించడం సరైన పద్ధతి కాదని అన్నారు. ఈ కార్యక్రమంలో బాడుకోలు దేవేందర్ రెడ్డి,గన్నవరం సుదర్శన్ ,మడుపు శ్రీనివాస్, నిమ్మల శ్రీనివాస్, జవాజి సునీత,తాడూరి మధుకర్, శ్రీ రామోజీ మధు ,విశ్వజ్ఞచారి, కొమ్మ కుమార్,కొల్లూరి ప్రసాద్ ,తోట మహేష్, పున్ని పాదం , మంచిర్యాల్ మల్లన్న ,శ్రీనివాస చారి, గంగుల రాజేష్ ,గంగుల సత్యవతి , రామచంద్రన్ పటేల్, తాండ్ర సంజీవరాజు ,అంజిబాబు, రామారావు ,ఎండి ఆసిఫ్, జేవి రాజు ,ఎండి ఫిరోజ్, పిఎన్ పటేల్ ,పి గురుమూర్తి తదితరులు పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :