Tuesday, 28 July 2026 04:06:27 AM

ఐక్య ఉద్యమాల ద్వారా లేబర్ కోడ్ లను తిప్పి కొట్టగలుగుతాం...

IFTU రాష్ట్ర నాయకులు తోకల రమేష్, గుజ్జుల సత్యనారాయణరెడ్డి

Date : 23 September 2024 01:02 PM Views : 337

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / గోదావరిఖని : IFTU ఆధ్వర్యంలో NTPC లేబర్ గేట్ ఎదురుగా కార్మిక సంఘాల పిలుపు మేరకు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా IFTU రాష్ట్ర నాయకులు తోకల రమేష్, గుజ్జుల సత్యనారాయణరెడ్డి మాట్లాడుతూ... గత సంవత్సరం మోడీ ప్రభుత్వం అత్యంత నిరంకుశంగా ఎలాంటి చర్చ లేకుండా పార్లమెంటులో కార్మిక చట్టాలను సవరించిందని అన్నారు. కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను కాలరాసే విధంగా కార్మిక చట్టాలను రూపొందించి ఆమోదించి ఆదానీ అంబానీ లాంటి కార్పోరేట్ శక్తులకు కార్మిక చట్టాలను తాకట్టు పెట్టే విధంగా వ్యవహరించిందని వారు మండిపడ్డారు. దేశవ్యాప్తంగా కార్మిక వర్గం మోడీ చర్యలను నిరసిస్తూ బ్లాక్ డే ను విజయవంతంగా కొనసాగిస్తోందని ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం కార్మిక వర్గానికి బహిరంగంగా క్షమాపణ చెప్పి కార్మిక చట్టాలను సవరించే చర్యలను, లేబర్ కోడ్ లను రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. మోడీ ప్రభుత్వం విధానాలను తిప్పికొట్టాలంటే దేశంలో బలమైన విశాల ఐక్య ఉద్యమం జరగాలని ఆ దిశగా కార్మిక వర్గం ఉద్యమాలలో కలిసి రావాలని మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చైతన్యంతో ఉద్యమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.ఇంకా ఈ కార్యక్రమంలో CPI ML మాస్ లైన్ ప్రజా పంథా కరీంనగర్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి జూపాక శ్రీనివాస్, IFTU జిల్లా నాయకులు ఆడెపు శంకర్, మార్త రాములు, గొల్లపల్లి చంద్రయ్య, పెండ్యాల రమేష్, కలవల రాయమల్లు, కోడిపుంజుల లక్ష్మి, గూడూరి వైకుంఠం, బత్తుల సదానందం, బత్తుల రాజన్న, ఎస్.డోమన్, తదితరులు పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :