ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / గోదావరిఖని : నాణ్యతలేని వస్తువులతో ఆహార పదార్థాలు తయారు చేస్తున్న గోదావరి ఖని మార్కండేయ కాలనీ లోని తాజ్ ఫ్యామిలీ రెస్టారెంట్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నిర్వాహకులకు రామగుండం నగర పాలక సంస్థ గురువారం 8 వేల రూపాయల జరిమానా విధించింది. అదనపు కలెక్టర్ ( స్థానిక సంస్థలు ) , రామగుండం నగర పాలక సంస్థ కమిషనర్ ( ఎఫ్ ఎ సి ) అరుణ శ్రీ ఆదేశాల మేరకు హెల్త్ అసిస్టెంట్ కిరణ్ , ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ మధుకర్ , ఎం ఐ ఎస్ ఆపరేటర్ శ్రీకాంత్ లతో కూడిన బృందం ఈ తనిఖీలు నిర్వహించి నిర్వాహకుల నుండి జరిమానా వసూలు చేశారు.
Admin
Aakanksha News