ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / మంథని రురల్ : మంథని మండలం లక్కేపూర్ శివారులో మాసు రమాదేవి (36)లు అనే వివాహిత హత్యకు గురికావడంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని హత్యకు గల కారణాలను పరిశీలించారు. అయితే ఈ హత్యకు లక్కేపూర్ గ్రామానికి చెందిన పండుగు మొగిలిపై అనుమానం ఉందని మృతురాలి భర్త మాసు సత్యనారాయణ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే దీనిపై పోలీసులు విచారణ జరుగుతున్న సమయంలో నిందితుడైన పండుగ మొగిలి బసంత్ నగర్ ఎయిర్ పోర్టు సమీపంలో చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.. ఘటన సంబంధించి మరిన్ని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..
Admin
Aakanksha News