Tuesday, 28 July 2026 11:58:03 AM

హత్య కేసులో నిందితుడి ఆత్మహత్య...

Date : 28 April 2025 08:12 PM Views : 798

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / మంథని రురల్ : మంథని మండలం లక్కేపూర్ శివారులో మాసు రమాదేవి (36)లు అనే వివాహిత హత్యకు గురికావడంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని హత్యకు గల కారణాలను పరిశీలించారు. అయితే ఈ హత్యకు లక్కేపూర్ గ్రామానికి చెందిన పండుగు మొగిలిపై అనుమానం ఉందని మృతురాలి భర్త మాసు సత్యనారాయణ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే దీనిపై పోలీసులు విచారణ జరుగుతున్న సమయంలో నిందితుడైన పండుగ మొగిలి బసంత్ నగర్ ఎయిర్ పోర్టు సమీపంలో చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.. ఘటన సంబంధించి మరిన్ని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :