ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / మంథని : సుందిళ్ళ, ముస్యాల రహదారి మధ్యలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయపడ్డారు. వివరల్లోకి వెళ్తే... మంథని మండలం ఇప్పలపల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న విద్యాసాగర్, లక్ష్మణ్ అనే ఉపాధ్యాయులు పాఠశాలకు వెళ్తున్న సమయంలో ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనం ఢీ కొనడంతో విద్యాసాగర్ కాలుకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో గాయపడిన ఇద్దరిని చికిత్స నిమిత్తం గోదావరిఖని ప్రభుత్వాసుపత్రికి స్థానికులు తరలించారు.
Admin
Aakanksha News