Tuesday, 28 July 2026 04:11:34 AM

ఈ ఎపిసోడ్‌ని ఇంతటితో ముగించండి....

పార్టీ శ్రేణులకు పీసీసీ చీఫ్‌ మహేష్‌ కుమార్‌ గౌడ్‌ ఆదేశం

Date : 03 October 2024 05:01 PM Views : 319

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : అక్కినేని నాగార్జున కుటుంబంపై మంత్రి కొండ సురేఖ చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపాయి. మంత్రి వ్యాఖ్యలపై సినీ ప్రముఖులు తీవ్రంగా స్పందించారు. సోషల్ మీడియాలో మంత్రి వ్యాఖ్యలు ఖండిస్తూ పోస్టులు పెడుతున్నారు. దీంతో కాంగ్రెస్ టీపీసీసీ చీఫ్ వెంటనే రంగంలో దిగి పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో వీడియోను షేర్ చేశారు.“సినీ ప్రముఖులకు పీసీసీ చీఫ్‌ మహేష్‌ కుమార్‌ గౌడ్‌ విజ్ఞప్తి.. ఈ ఎపిసోడ్‌ని ఇంతటితో ముగించండి. మంత్రి కొండా సురేఖ భేషరతుగా వ్యాఖ్యలు ఉపసంహరించుకున్నారు. ఇరువైపులా మహిళలే ఉన్నారు. ఈ విషయాన్ని ఇక్కడికే ముగిస్తే సమంజసంగా ఉంటుంది. కేటీఆర్ సోషల్ మీడియాలో మంత్రి మీద చేసిన ట్రోల్స్‌ కూడా సినిమా పెద్దలు గమనించాలి” మహేష్‌ కుమార్‌ గౌడ్‌ కోరారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :