ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని మైనార్టీ జూనియర్ కళాశాలలో 100 మంది విద్యార్థులకు కాళ్ల కలక వచ్చిందంటూ ఓ ప్రైవేట్ యాప్ లో వచ్చిన వార్త కథనం పూర్తిగా అవాస్తవమని మైనార్టీ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ సిరాజ్ బేగ్ ఖండించారు. తమ కళాశాలలో ప్రథమ, ద్వితీయ సంవత్సరం కలిపి మొత్తం 100 మంది విద్యార్థులు కూడా లేరని కానీ సదురు ప్రైవేటు యాప్ నిర్వాహకులు వంద విద్యార్థులకు వచ్చినట్లు రాయడంపై ఆయన వివరణ ఇచ్చారు. ఈ ప్రైవేట్ యాప్ నిర్వాహకులపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశానని వారిపై లీగల్ గా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
Admin
Aakanksha News