ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : ఫార్ములా ఈ కేసులో ఏసీబీ విచారణకు హాజరయ్యేందుకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీమంత్రి కేటీఆర్ నందినగర్ లోని తన నివాసం నుండి బంజారాహిల్స్ లోని ఏసీబీ కార్యాలయంకు బయలుదేరారు. అయితే ఏసీబీ కార్యాలయం ప్రధాన రహదారిపై కేటీఆర్ వాహనాన్ని ఆపివేసిన పోలీసులు నడుచుకుంటూ వెళ్లాలని వాహనానికి అనుమతి లేదంటూ తెలిపారు. కేటీఆర్ వెంట ఎవరు న్యాయవాదులు కూడా వెళ్లకూడదని ఒక్కరే లోపలికి వెళ్లాలని తెలిపారు. అయితే చట్ట ప్రకారం ప్రతి పౌరుడు తమ హక్కులను వినియోగించుకోవచ్చు అని మాజీ మంత్రి కేటీఆర్ పోలీసులకు తెలిపారు.
Admin
Aakanksha News