ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / సంగారెడ్డి జిల్లా : వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల మరో వివాదంలో ఇరుక్కున్నారు. సంగారెడ్డి జిల్లాలో నిర్వహిస్తున్న ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా వైయస్ షర్మిల ఆదోని నియోజకవర్గం జోగిపేటలో స్థానిక ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ను అవమానపరిచే విధంగా అనుచిత వాక్యాలు చేసినందుకు షర్మిలపై టిఆర్ఎస్ నాయకులతో పాటు దళిత సంఘాలు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. జోగిపేట బస్టాండ్ వద్ద జరిగిన బహిరంగ సభలో వైఎస్ షర్మిల "క్రాంతి కిరణ్ కాదు" కంత్రి కిరణ్ అంటూ ఘాటుగా విమర్శలు చేశారు. ఏక్కడ ప్రభుత్వ స్థలం కనిపించిన కబ్జాలకు పాల్పడుతున్నారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దీంతో వైయస్ షర్మిల చేసిన వ్యాఖ్యలపై టిఆర్ఎస్ నాయకులతోపాటు దళిత సంఘాల నాయకులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
Admin
Aakanksha News