Tuesday, 28 July 2026 09:49:26 AM

కాంగ్రెస్ పార్టీ బిసి వ్యతిరేక పార్టీ

బీసీ సంక్షేమ సమితి రాష్ట్ర అధ్యక్షులు బోల్క వెంకట్ యాదవ్

Date : 29 October 2023 09:23 PM Views : 754

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / నల్లగొండ జిల్లా : ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని రెండు పార్లమెంటు స్థానాలకు గాను బీసీలకు కాంగ్రెస్ పార్టీ ఒక్క అసెంబ్లీ స్థానం కేటాయించక పోవడం దుర్మార్గం అని బీసీ సంక్షేమ సమితి రాష్ట్ర అధ్యక్షులు బోల్క వెంకట్ యాదవ్ విమర్శించారు. ఆదివారం బీసీ సంక్షేమ సమితి భవన్ లో విలేకరులు సమావేశంలో మాట్లాడుతూ బిసిల కుర్చీలపై అగ్రకులాల కబ్జా ఇంకా ఎన్నాళ్లు అని ప్రశ్నించారు.ఒక్క పార్లమెంట్ స్థానంలో రెండు బీసీ అసెంబ్లీ స్థానాల్లో బీసీలకు కేటాయిస్తున్న కాంగ్రెస్ పార్టీ మాట తప్పిందన్నారు.కాంగ్రెస్ పార్టీ అంటేనే రెడ్ల పార్టీ అని మరోసారి రుజువయిందని అన్నారు.బీసీలు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయొద్దని గ్రామ గ్రామాన తిరిగి బీసీల వ్యతిరేక పార్టీలను బొంద పెట్టాలని పిలుపునిచ్చారు.బడుగు బలహీన వర్గాల ఓట్లు మాత్రం కావాలి సీట్లు మాత్రం ఇవ్వరు కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం చేయాలి అన్నారు

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :