ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / రంగారెడ్డి జిల్లా : గ్యాస్ సిలిండర్లు తూకం తక్కువగా ఉంటే..ఫిర్యాదు చేసే హక్కు వినియోగదారులకు ఉందని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటీ తాసిల్దార్ మాచన రఘునందన్ స్పష్టం చేశారు మంగళ వారం నాడు ఆయన మాడ్గుల కు వచ్చారు.ఈ సందర్భంగా రఘునందన్ మాట్లాడుతూ..గ్యాస్ సిలిండర్ల ను డోర్ దాక తేకుండా రోడ్డు పై నే పెట్టీ పోతున్నారు ఆన్న ఫిర్యాదు ల తో పాటు,అధికంగా వసూలు చేస్తున్నారు అని కొందరు ఫిర్యాదు చేశారని చెప్పారు.గ్యాస్ బండ ల పరిమాణం పై అనుమానం ఉంటే.ఎంత బరువు ఉందో తూకం వేసి పరీక్షించే హక్కు వినియోగదారులకు ఉందని స్పష్టం చేశారు.
Admin
Aakanksha News