ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / పెద్దపల్లి జిల్లా : పెద్దపల్లి ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో మద్యం సేవించి పట్టుబడిన వారిని జూనియర్ సివిల్ జడ్జి రాణి ఎదుట హాజరుపరచగా పెద్దపల్లి పట్టణంలోనీ కొంతమ్ వాడకు చెందిన కాషెట్టి రవీందర్, మహారాష్ట్ర గడ్చిరోలికి చెందిన ముల్కరి రోహిత్, మధుకర్, సుల్తానాబాద్, శాస్త్రి నగర్ కు చెందిన కాల్వల వినయ్ లకు ఒక రోజు జైలు శిక్షతో పాటు 3వేల రూపాయల జరిమానాను విధించినట్లు ట్రాఫిక్ సీఐ అనిల్ కుమార్ పేర్కొన్నారు. వాహనదారులు మద్యం సేవించి వాహనాలు నడిపితే జరిమాన లతో పాటు జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు.
Admin
Aakanksha News