Wednesday, 29 July 2026 09:27:44 AM

హైదరాబాద్‌ను సర్వనాశనం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర...

ప్రభుత్వం తప్పులను ఎత్తి చూపుతునందుకే కేటీఆర్‌పై అక్రమ కేసు...

Date : 20 December 2024 02:42 PM Views : 515

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : హైదరాబాద్‌ను సర్వనాశనం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తుందని అందులో భాగంగానే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై అక్రమ కేసు పెట్టారని ఆరోపించారు.శాసన మండలి మీడియా పాయింట్ వద్ద బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ మధుసూదనాచారి, మహమూద్‌ అలీ, సత్యవతి రాథోడ్‌ కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు...ఫార్ములా-ఈ రేస్ అన్ని వివరాలు చెప్పారని, ఇందులో ఎలాంటి అవినీతి జరగలేదని స్పష్టం చేశారు. చాలా పారదర్శకంగా చెల్లింపులు జరిగాయని వెల్లడించారు. ప్రభుత్వం తప్పులను ఎత్తి చూపుతునందుకే ఈ అక్రమ కేసు పెట్టారని విమర్శించారు. రాష్ట్రంలో భయానక వాతావరణం అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ బిడ్డలకు పోరాటాలు కొత్తకాదని చెప్పారు. ఎలాంటి కేసులైన ధైర్యంగా ఎదుర్కొంటారని స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పై పెట్టిన అక్రమ కేసును ఉపసంహరించుకునే వరకు మండలిలో పోరాడుతామని విపక్ష నేత, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ మధుసూదనాచారి అన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :