Tuesday, 28 July 2026 01:28:22 PM

సోనియా, రాహుల్‌లు బెయిల్ మీద ఉన్న నిందితులు...

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Date : 18 April 2025 06:36 PM Views : 687

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / : నేషనల్ హెరాల్డ్‌కు సంబంధించి రూ.2 వేల కోట్లు కాజేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నించిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. 2011లో యుపిఎ ప్రభుత్వం ఉన్నప్పుడే ఈ కేసులో సిబిఐ దర్యాప్తు ప్రారంభమందన్నారు. కేసు నమోదైనప్పుడే.. సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు బెయిల్ పొందారని, సోనియా, రాహుల్‌లు బెయిల్ మీద ఉన్న నిందితులని సంచలన వ్యాఖ్యలు చేశారు. నేషనల్ హెరాల్డ్ కేసుతో బిజెపికి ఎలాంటి సంబంధం లేదని.. భారతీయ చట్టాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు వర్తించవా అని ప్రశ్నించారు. 12 ఏళ్ల విచారణ తర్వాత నేషనల్ హెరాల్డ్ కేసులో ఛార్జిషీట్ దాఖలైందని తెలిపారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :