ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / : కంటోన్మెంట్ నామినేటెడ్ బోర్డు సభ్యురాలుగ మాజీ వైస్ చైర్మన్ భానుక నర్మదా మల్లికార్జున్ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర రక్షణ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తనను నామినేటెడ్ బోర్డ్ సభ్యురాలుగా నియమించినందుకు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రక్షణ శాఖ మంత్రి రతన్ సింగ్, కేంద్ర మంత్రివర్యులు జి కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్ పార్లమెంటు సభ్యులు డాక్టర్ కే లక్ష్మణ్ లకు బానుక నర్మదా మల్లికార్జున్ ధన్యవాదాలు తెలిపారు. తమను వెన్నంటి ప్రోత్సహిస్తున్న మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ కు భానుక నర్మదా మల్లికార్జున్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కంటోన్మెంటు బిజెపి కార్యకర్తలకు నాయకులకు కంటోన్మెంట్లో వివిధ సంఘాలకు వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
Admin
Aakanksha News