ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / మంచిర్యాల జిల్లా : మంచిర్యాల జిల్లా సీసీసీ నస్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో టాస్క్ ఫోర్స్ సీఐ రాజ్ కుమార్, ఎస్ఐ లచ్చన్న, సిబ్బంది కలసి అనుమానస్పదంగా వెళ్తున్న TS 05 UC 1578 నంబర్ అశోక్ లెలాండ్ వాహనాన్ని ఆపి తనిఖీ చేసి,అక్రమంగా మహారాష్ట్రకి తరలిస్తున్న 25 క్వింటాళ్ల రేషన్ బియ్యం ట్రాలీని స్వాధీన పరుచుకొని సిరిగిరి సుధాకర్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం జరిగిందని పోలీసులు తెలిపారు.పట్టుబడిన వాహనాన్ని, నిందితుడిని తదుపరి విచారణ నిమిత్తం సీసీ నస్పూర్ పోలీస్ స్టేషన్ వారికీ అప్పగించడం జరిగిందన్నారు.
Admin
Aakanksha News