ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : పెద్దపల్లి జిల్లా గోదావరిఖని జిఎం ఆఫీస్ మూలమలుపు వద్ద ఓ బూడిద లారీ బోల్తా పడింది.. ఈ ఘటనలో డ్రైవర్ తల్లా సాగర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.ఎన్టీపీసీ నుండి ఆసిఫాబాద్ కు వెళ్తున్న TS03UB2277 అనే లారీ బూడిద తీసుకు వెళ్తుండగా ఓవర్ లోడ్ కావడంతో మూలమలుపు వద్ద బోల్తా పడింది. దీంతో కొంతసేపు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. లారీలో డ్రైవర్ సాగర్ తో పాటు క్లినర్ నవీన్ ఉన్నాడు
Admin
Aakanksha News