ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : గోదావరిఖనిలో మట్టి మాఫియ రోజురోజుకూ పేరిగిపోతుందని ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ట్రాక్టర్ల ద్వారా మట్టిని తరలిస్తు కొంత మంది ముఠాగా ఏర్పడి ప్రభుత్వ ఆదాయాన్ని గండికోడుతున్నారని ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షులు మద్దెల దినేష్ పేర్కొన్నారు. మూడు ట్రాక్టర్లు అరు టిప్పర్లు గా యేదేచ్చగా కొనసాగుతున్న రెవెన్యూ, మైనింగ్ అధికారులు పట్టించుకోవడం లేదని వారి అండతోనే చెలరేగిపోతున్న మట్టి మాఫీయాపై ఉక్కుపాదం మోపాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ని లేఖ ద్వారా కోరారు. అనంతరం మద్దెల దినేష్ మాట్లాడుతూ..రామగుండం పారిశ్రామిక ప్రాంతం అంటేనే సహజ వనరులకు కేంద్రానికి నీలయంగా ఉందని ఇక్కడ నల్ల బంగారంతో పాటు పక్కనే గోదావరి నది ఉండటంతో పాటు ఇసుక, మట్టి పుష్కలంగా ఉండడంతో ఇదే అదునుగా భావించి ఎలాంటి అనుమతులు లేకుండానే మట్టి మాఫియా మట్టిని తోడుకొని మాఫియాలుగా ఏర్పడి కుబేరులుగా తయారవుతున్నారని మట్టి మాఫియాతో అక్రమంగా కొంత మంది బాడబాబులు ఒక గ్రూప్ గా ఏర్పడి తమ ఆర్థిక సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటున్నారని ఆరోపించారు.గోదావరిఖనిలో మట్టి మాఫియాగా ఏర్పడిన వారికి ఎలాంటి అనుమతులు అవసరం లేదన్నట్లుగా మైనింగ్ ఫారెస్ట్ రెవెన్యూ, అధికారుల అధికారుల అండదండలతోనే మట్టి మాఫియాను ఇష్టారాజ్యంగా నడిపిస్తూ వారికి అడ్డొస్తే అంతే సంగతులు ఆన్న చందంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. సంబంధించిన శాఖ అధికారులకు మేము కొంత ముడుపులు ముట్టజెపుతున్నామని ట్రాక్టర్స్ ఓనర్స్ బహిరంగంగా చెప్తునప్పటికి అదికారులు కనీసం కన్నెత్తి చూసే పరిస్థితి కూడా లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.అక్రమార్కులు ఇష్టానుసారంగా ఎప్పుడు అవసరమైతే అప్పుడు గుట్టలను తవ్వేస్తున్నారని అన్నారు. పెద్దఎత్తున ప్రకృతి సంపదను కొల్లగొడున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయని లేఖలో పేర్కొన్నారు.ఇట్టి మట్టి మాఫియాకు అధికార పార్టీ అండదండలు ముఖ్యంగా సంబందించిన అధికారులు నిలువెత్తున అండగా నిలుస్తున్నారని కావున మట్టి మాఫియా పై సమగ్ర విచారణ చేయాలని ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని గండి కొడుతున్న మట్టి మాఫియా పై కఠిన చర్యలు తీసుకోవాలని, సహజ వనరులను కాపాడాలని మట్టిని అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్లను సీజ్ చేయాలని, ముఖ్యంగా అవినీతి అధికారి అయిన మైనింగ్ అధికారిపై విచారణ చేసి వారిని సస్పెండ్ చేయాలని జిల్లా కలెక్టర్ కి ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ ద్వారా కోరడం జరిగిందని లేఖలో పేర్కొన్నారు.
Admin
Aakanksha News