ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : ఈనెల 21 నుంచి జరిగే గ్రూప్-1 మెయిన్ పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేస్తూ అభ్యర్థులు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేసిన సంగతి తెలిసిందే...అయితే దీనిపై తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో గ్రూప్ -1 అభ్యర్థులు సమావేశమయ్యారు.పరీక్షలు వాయిదా వేసేలా సర్కార్పై ఒత్తిడి తేవాలని కేటీఆర్కు అభ్యర్థులు విన్నవించారు. ఈ సందర్భంగా అభ్యర్థుల సమస్యలను కేటీఆర్ అడిగి తెలుసుకున్నారు.అయితే గ్రూప్-1 మెయిన్స్ను రీ షెడ్యూల్ చేయాలని గత కొద్ది రోజుల నుంచి అభ్యర్థులు డిమాండ్ చేస్తోన్న సంగతి తెలిసిందే. కానీ కాంగ్రెస్ సర్కార్ పట్టించుకోవడం లేదు. ఈ నెల 21 నుంచి గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు నిర్వహించేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిద్ధమైంది.
Admin
Aakanksha News