ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : మాజీ కేంద్రమంత్రి స్వర్గీయ సూదిని జైపాల్ రెడ్డి 82వ జయంతిని పురస్కరించుకుని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఘనంగా నివాళ్ళు అర్పించారు.ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లో నూతనంగా నిర్మించిన స్ఫూర్తి స్థల్ లో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మల్లురవి రాష్ట్ర మంత్రి మండలి సభ్యులు జూపల్లి కృష్ణారావు ,మాజీ జెడ్పీటీసీ మామిడి శ్యామ్ సుందర్ రెడ్డి మరియు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ నాయకులు, రాష్ట్ర, కేంద్ర స్థాయి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు..
Admin
Aakanksha News