ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / నాగర్కర్నూల్ జిల్లా : నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలోఅత్యంత పురాతన దేవాలయాలల్లో ఒకటైన ఉట్ల కోనేరు గుడికి సామాజిక కార్యకర్త సాదె రాజు తండ్రి సాదె రమేష్ లు తమ వంతు బాధ్యతగా ఐదు లక్షల రూపాయల విరాళాన్ని మంగళవారం నగదు రూపం లో ఆలయ కమిటీ సభ్యులు బెల్లి యాదగిరి,ఎల్ కృష్ణలకు అందజేశారు. గతంలో కూడా ఆలయప్రాంగణంలో ఉన్న వినాయక మండపం నిర్మాణానికి రాజు సహకారం ఉందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.దేవాలయ అభివృద్ధికి సహాయ సహకారాలు అందించినందుకు పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
Admin
Aakanksha News