Tuesday, 28 July 2026 10:47:28 AM

ఎమ్మెల్యేకు బహిరంగ ప్రశ్నలు వేసిన ఆశావాహులు...

పత్రిక ప్రకటనలో తమదైన శైలిలో ఘాటు వాక్యాలు...

Date : 18 July 2023 02:28 PM Views : 1414

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : రామగుండం రాజకీయాలు గత వారం రోజులుగా హీట్ ఎక్కుతున్నాయి. రాష్ట్ర రాజకీయాలకు దీటుగా రామగుండం రాజకీయం నడుస్తూ ఉండడంతో రాష్ట్ర మొత్తం చూపు రామగుండం వైపే ఉన్నట్లు కనిపిస్తుంది.. ఎమ్మెల్యే పైన తమదైన శైలిలో విమర్శలు చేస్తూ తాము కూడా బరిలో ఉన్నామని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, సింగిల్ విండో చైర్మన్ బయ్యపు మనోహర్ రెడ్డి, పాలకుర్తి జెడ్పిటిసి కందుల సంధ్యారాణి, నగరపాలక సంస్థ తొలి మాజీ మేయర్ కొంకటి లక్ష్మీనారాయణ, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, తెలంగాణ ఉద్యమకారులు పాతిపెళ్లి ఎల్లయ్యలు కలసి ప్రజా ఆశీర్వాద యాత్ర పేరుతో మున్సిపల్ చౌరస్తా వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి అనంతరం ప్రధాన చౌరస్తా వద్ద తెలంగాణ అమరవీరుల స్థూపానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి పాదయాత్రను ప్రారంభించారు. అయితే దీనిపై స్పందించిన రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారు అంటూ క్రమశిక్షణ కమిటీ జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేసి వారిని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఆశావాహులు ఒక అడుగు ముందు వేసి ఏకంగా ఎమ్మెల్యే పై ఘాటు విమర్శలు చేస్తూ ప్రకటన విడుదల చేయడం రామగుండం రాజకీయాలు సంచలనంగా మారుతున్నాయి. ఈ లేఖలో రామగుండం ఎమ్మెల్యే కోరుకొండ చందర్ చరిత్ర ప్రజలకు తెలియంది కాదని.. 2009 లో టిఆర్ఎస్ పార్టీ మహాకూటమి అభ్యర్థిగా ప్రకటిస్తే కనీసం డిపాజిట్ కూడా రాకుండా ఓడిపోయారని నాలుగో స్థానానికి పరిమితం అయ్యారని పేర్కొన్నారు. 2014 ఎన్నికల్లో పార్టీకి, పార్టీ నాయకత్వానికి వ్యతిరేకంగా పనిచేసినప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ గుర్తుకు రాలేదని వారు ప్రశ్నించారు. 2018 ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ కు వ్యతిరేకంగా పని చేసి సింహం గుర్తుపై పోటీ చేసింది నిజం కాదా.. అని ప్రశ్నించారు. ఆనాటి ఎన్నికల్లో మేమందరం కలిసి అహర్నిశలు కష్టపడి గెలిపించింది నిజం కాదా..? అని అన్నారు. నీ పక్కన ఉన్న కొంత మంది నాయకులు నాడు శవరాజకీయాలు చేశారని రామగుండం నియోజకవర్గంలో నేనే రాజు నేనే మంత్రి సినిమాను తలపించే విధంగా వాళ్ళను నడుస్తుందని వారు లేఖలో ఘాటుగా విమర్శించారు. ఇలాంటి మరెన్నో ప్రశ్నలతో ఆశావాహులు విడుదల చేసిన ప్రకటన ఇప్పుడు రామగుండం రాజకీయాలు హాట్ టాపిక్ గా మారింది.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :