ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / కరీంనగర్ జిల్లా : ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి వెంటనే భేషరత్తుగా క్షమాపణ చెప్పాలని వీణవంక మండల కేంద్రంలో ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ నిరసన ప్రదర్శనలో మండలంలోని పలు గ్రామాలకు చెందిన ముదిరాజ్ సంఘం నాయకులు యువకులు భారీ ఎత్తున నిరసనలు తెలిపారు. ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి పై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు.ముదిరాజులను కించపరుస్తూ చేసిన వాఖ్యలపై మండిపడ్డారు.ముదిరాజులకు క్షమాపణ చెప్పేంతవరకు నిరంతరం నిరసన తెలియజేస్తామని వారు హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో మండల ముదిరాజు సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Admin
Aakanksha News