ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / : ప్రభుత్వం పంపిణి చేస్తున్న రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా పక్క సమాచారంతో లారీని ఎస్ఓటీ పోలీసులు ఓఆర్ఆర్ వద్ద లారీని అదుపులోకి తీసుకుని శామీర్ పేట్ పోలీస్ స్టేషన్కు తరలించారు.వివరాల్లోకి వెళ్తే...ఏపీ 23యూ5899 నెంబర్ గల లారీలో నందిగామకు చెందిన డ్రైవర్ ఎస్కే సర్ధార్, క్లీనర్ చంద్రం కలిసి దాదాపు 25 టన్నుల రేషన్ బియ్యాన్ని ఆటోనగర్ మలక్ పేట్ నుంచి సిద్ధిపేట్కు తరలిస్తున్నారు. అయితే పక్క సమాచారం అందుకున్న పోలీసులు టోల్గేట్ వద్ద తనిఖీలు చేసి అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న లారీని స్వాధీనం చేసుకున్నారు.
Admin
Aakanksha News